హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కాలేజీలలో సీట్ల భర్తీకి పాలిసెట్-2024 తొలి విడుత కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. 113 పాలిటెక్నిక్ కాలేజీలలో 28,931 సీట్లు ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 20,890 సీట్లు భర్తీ అయ్యాయి. 8,041 సీట్లు భర్తీ కాలేదని పాలిసెట్ అడ్మిషన్ కన్వీనర్ తెలిపారు. మొత్తం సీట్లలో కేవలం 72.21%మాత్రమే భర్తీ అయ్యాయాని పేర్కొన్నారు. ఇందులో 57 ప్రభుత్వ కాలేజీలలో కూడా 1941 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో 6,100 సీట్లు భర్తీ కాలేదని వెల్లడించారు. 4 పాలిటెక్నిక్ కాలేజీలలో 100% సీట్లు భర్తీ అయినట్టు కౌన్సెలింగ్ అధికారులు తెలిపారు.
ఇందులో 3 ప్రభుత్వ కాలేజీలు, ఒకటి ప్రైవేటు కాలేజీ ఉందని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 658 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీలలో సెల్ఫ్ రిపోర్టింగ్కు, ఫీజు చెల్లింపునకు ఈనెల 4 వరకు గడువు విధించామని పేర్కొన్నారు. తుది విడుత కౌన్సెలింగ్ ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. 15 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వివరాలకు https://tgpolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.