హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ)/ నారాయణఖేడ్: మహారాష్ట్రలోని పుణె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి.
నారాయణఖేడ్ పట్టణంలోని కటికె గల్ల్లీకి చెందిన ఆరుగురు యువకులు సోమవారం ఉదయం కారులో నారాయణఖేడ్ నుంచి ముంబైకి బయలుదేరారు. మంగళవారం మధ్యాహ్నం పుణెలోని ఇందాపూర్ తాలూకా డాలజ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న రెయిలింగ్కు ఢీకొన్నది.
దీంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న రఫీక్ ఖురేషీ (25), ఫిరోజ్ ఖురేషీ (26), మహబూబ్ ఖురేషీ (27), ఫిరోజ్ (29), సయ్యద్ ఇస్మాయిల్ (26) అక్కడికక్కడే మృతి చెందగా సయ్యద్అమన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడు స్థానికం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లారు.