హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోనల్ (ఎస్సీఆర్) 2023 పలు అక్రమాలకు చెక్ పెట్టింది. రైల్వే ఆస్తులు, ప్రయాణికుల రక్షణ, భద్రతను కాపాడింది. నిరుడు ఎస్సీఆర్ సాధించిన పలు విజయాలను గురువారం రైల్వే అధికారులు వెల్లడించారు. గతేడాదిలో రైల్వే రిజర్వేషన్ టికెట్లను అనధికారికంగా విక్రయిస్తున్న 261 మందిని అరెస్టు చేసి, రూ.2.30 కోట్లు విలువైనల 8770 టికెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే 728 మంది అనుమానిత వ్యక్తులను అరెస్టు చేసి, 10.28 లక్షల జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. టికెట్ లేకుండా రిజర్వేషన్ బోగీలో ప్రయాణించిన 702 మంది ప్రయాణికులను గుర్తించామని పేర్కొన్నారు. 23.09 కోట్ల విలువ చేసే గం జాయిని, 3.95 కోట్ల విలువ చేసే బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని, 28.65 లక్షల వి లువైన అక్రమ మద్యం సిసాలను పట్టుకున్న ట్టు చెప్పారు. 9.35 కోట్ల విలువ చేసే ప్రయాణికుల వస్తువులను తిరిగి వారే అప్పగించారని తెలిపారు. రైళ్ల ప్రాంగణాల నుంచి 1115 మంది బాలురు, 228 మంది బాలికలను రక్షించి, అప్పగించినట్టు తెలిపారు.