హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని ఖైదీల కుటుంబీకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు. స్పందించిన సీఎం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఖైదీల ముందస్తు విడుదలకున్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీ ముందుంచంగా, ఈ కమిటీ విడుదలకు అర్హులైన వారి జాబితాను క్యాబినెట్కు పంపగా ఆమోదముద్ర వేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్షపడిన వారు, 8 మంది తకువ కాలం శిక్ష పడిన వారు ఉన్నారు.