కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. ఆగమేఘాల మీద ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు సమర్పించారు.
‘మాది ఒక్కటే ఫ్లోర్.. కొందరికి జీరో బిల్లు వచ్చింది.. మాకెందుకు రాలేదం’టూ...వంద సంఖ్యలో లబ్ధిదారులు సోమవారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధి కార్యాలయాలకు చేరుకొని అధికారులను నిలదీశారు.