బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
బీజేపీ పాలిత మణిపూర్లోని ఇంఫాల్ నదిపై గల బైలీ వంతెన ఆదివారం కూలిపోవడంతో ఒక ట్రక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ గల్లంతయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమా�