శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు. నిజానికి రామావతారంలోగానీ, కృష్ణావతారంలో గానీ మానవ రూపం పొందిన స్వామి ఎన్నో కష్టాలు పడ్డా, నిర్వికారంగా ప్రవర్తించాడు. బాలకృష్ణుడు పూతనాది రాక్షస సంహారాన్ని గావించాడు. కొంత పెద్దయ్యాక వెన్నదొంగగా, మిత్రులందరికీ వెన్నపంచాడు. ఆ తర్వాత కంసాదులను సంహరించి భూభారాన్ని తగ్గించాడు.
పాండవులకు అండగా నిలిచాడు. ఆయన ఈ జగత్తుకే గురువుగా నిలిచాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించే భగవద్గీతను మనకు అందించాడు. ఆయన లీలలు ఎంత నుతించినా తనివితీరదు. యదుభూషణుడైన ఆ పరమాత్మను ఎంత కీర్తించినా మనకు తెలియనిది కొంత ఏదో మిగిలే ఉంటుంది. ఆ కృష్ణలీలామృతాన్ని 104 పద్యాలతో భక్తి నివేదన చేశారు రచయిత చంద్రప్రతాప్. అర్జునుడికి చేసిన కర్తవ్యబోధ, కాళీయుని సంస్కరించడం, గోపికల వస్ర్తాపహరణం, ద్రౌపదీ మాన సంరక్షణం ఇలా కృష్ణావతారంలోని ముఖ్యఘట్టాలన్నీ ఈ శతకంలో పొందుపరిచారు. భావసహితంగా రూపుదిద్దుకున్న శ్రీకృష్ణశతకం నేటి తరానికి, రాబోయే తరానికి భగవంతుడి గురించి తెలుసుకోవడంలోనూ, తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించడంలోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
శ్రీకృష్ణ శతకం (భావ సహితం)
రచయిత: చంద్రప్రతాప్ కంతేటి
పేజీలు: 104, వెల: రూ.100
ప్రతులకు: 80081 43507
– డా॥ వి.వి. వేంకటరమణ
త్రిలింగములు
రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి
పేజీలు: 80;
ధర: రూ. 125
ప్రచురణ: గ్లోబల్ న్యూస్ ప్రచురణలు
ప్రతులకు: 92461 65059
గులకరాళ్లు
రచన: లలితా వర్మ
పేజీలు: 80;
ధర: రూ. 100
ప్రచురణ: జేవీ పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 99496 72671
ఆజాదీ
రచన: కరిపె రాజ్కుమార్
పేజీలు: 168;
ధర: రూ. 150
ప్రతులకు: 81251 44729