Wimbledon : ప్రతిష్ఠాత్మక వింబుల్డన్(Wimbledon)లో స్టార్ ఆటగాడు యుకీ బాంబ్రీ (Yuki Bambri) బోణీ కొట్టాడు. బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. మరోవైపు ఎన్ శ్రీరామ్ బాలాజీ (N Sriram Balaji) తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో గర్జించాడు. గురువారం జరిగిన మ్యాచ్లో బాంబ్రీ, అల్బనో జోడీ తమ కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న డెన్మార్క్ ఆటగాళ్లకు షాకిచ్చింది. అలెగ్జాండర్ బబ్లిక్, అలెగ్జాండర్ షెవ్చెన్కో జంటను వరుస సెట్లలో వణికించి 6-4, 6-4తో విజయం సాధించింది.
వింబుల్డన్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ ప్రస్థానం ముగిసింది. పురుషుల డబుల్స్లో బ్రిటన్కు చెందిన ల్యుకె జాన్సన్తో కలిసి ఆడిన బాలాజీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు . దాంతో, మర్సెలో అరెవలో, మటే పవిక్ జంట చేతిలో బాలాజీ ద్వయం 4-6, 5-7తో ఓడిపోయింది.
We are thrilled to announce that Sumit Nagal, India’s No. 1 singles tennis player, has qualified for the Paris Olympics 2024! Join us in celebrating this milestone and supporting Nagal,Bopanna, and Balaji as they represent India on the world stage.🇮🇳🎾 #Olympics2024 #IndianTennis pic.twitter.com/y4K5X7DCha
— All India Tennis Association (@AITA__Tennis) June 22, 2024
ఇప్పటికే సింగిల్స్, డబుల్స్లో సుమిత్ నాగల్ (Sumith Nagal) చేతులెత్తేశాడు. దాంతో, భారత బృందం టైటిల్ ఆశలన్నీ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న మీదే ఉన్నాయి. తొలి రౌండ్లో విజయ భేరి మోగించిన బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ల జోడీ తర్వాతి పోరు జర్మనీ జంటతో తలపడనుంది.