Arshdeep Singh’s coach : భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20 వరల్డ్కప్ నెగ్గడంతో దేశమంతా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియన్ బౌలర్ ఆర్షదీప్సింగ్ కోచ్ జశ్వంత్ రాయ్ కూడా ఇవాళ చండీగఢ్లో సంబరాలు జరుపుకున్నారు. కోచింగ్ కేంద్రంలోనే తన ఇతర శిష్యులతో కలిసి డోలు చప్పుడుకు అనుగుణంగా భాంగ్రా నృత్యం చేశారు.
#WATCH | Chandigarh: Indian cricketer Arshdeep Singh’s coach Jaswant Rai celebrates and performs bhangra after India wins T20 World Cup 2024. https://t.co/gEPw0txjIB pic.twitter.com/xzMrCOsE6j
— ANI (@ANI) June 30, 2024
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్ టీ20 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని అన్నారు. అర్షదీప్ బౌలింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు. అర్షదీప్ ప్రదర్శన తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అర్షదీప్ వైవిధ్యమైన బంతులతో భారత జట్టు బౌలింగ్ బలం మరింత రెట్టింపైందని తెలిపారు.
అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంపై కూడా జశ్వంత్ రాయ్ స్పందించారు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం వాళ్లు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రోహిత్, కోహ్లీ తమ ఆట తీరుతో భావి తరఫు క్రికెటర్లకు మార్గదర్శకులుగా నిలిచారని వ్యాఖ్యానించారు.
#WATCH | Chandigarh: Indian cricketer Arshdeep Singh’s coach, Jaswant Rai says, “Arshdeep bowled very well…He remained calm and bowled a very good over giving 16 runs to Hardik Pandya to defend in the last over. I am very happy with his performance…With the variation in… pic.twitter.com/KVjJmV7vWq
— ANI (@ANI) June 30, 2024