Virat Kohli : బార్బడోస్ నుంచి పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు (Team Inida)కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగడంతో మొదలైన అభినందనల వెల్లువ ఇంకా రెట్టింపు అవుతోంది. వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిసిన భారత జట్టు సభ్యులు తమ విజయానికి దక్కిన గౌరవమర్యాదలను చూసి పొంగిపోతున్నారు. ప్రధాని నివాసంలో బ్రేక్ఫాస్ట్.. ఫొటో సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రైమ్ మినిస్టర్ మోడీకి ధన్యవాదాలు తెలిపాడు.
అల్పాహారం తర్వాత ప్రధానికి షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఆ ఫొటోకు ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం నిజంగా గొప్ప గౌరవం. మమ్మల్ని ప్రధాని నివాసానికి ఆహ్వానించినందుకు థ్యాంక్యూ సర్’ అని క్యాప్షన్ రాశాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో ప్రధాని మోడీని కలవడం పట్ల లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీగారిని కలవడం ఎంతో గర్వంగా ఉంది. ప్రోత్సాహకరమైన మీ మాటలకు ధన్యవాదాలు సర్’ అని చాహల్ తన పోస్ట్లో వెల్లడించాడు.
ఢిల్లీలో ప్రధానితో ఫొటో దిగాక భారత జట్టు ముంబై బయల్దేరింది. సాయంత్రం 4:30 గంటలకు ‘మెరైన్ డ్రైవ్’ పరేడ్ షురూ కానుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. సందడిగా ముందుకు సాగనుంది. అనంతరం రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
Magical Evening Awaits 🤩
Join us in welcoming and celebrating the #T20WorldCup Champions 🇮🇳 🏆
📍 Wankhede Stadium
🗓️ Thursday, 4th July 2024
⏰ 4:00 PM IST Onwards
Enter via Gates 2, 3 and 4#TeamIndia pic.twitter.com/UYIZgIkZly— BCCI (@BCCI) July 4, 2024