Wrestling | అమ్మన్: అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్లు పతకాల పంట పండించారు. అమ్మన్ (జోర్డాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పోటీపడ్డ ముగ్గురు మహిళలు బంగారు పతకాలు సాధించగా గ్రీకో రోమన్లో బరిలోకి దిగిన పురుష రెజ్లర్లు రజత, కాంస్యాలతో మెరిశారు.
మహిళల 50 కిలోల విభాగంలో మీనాక్షి స్వర్ణం సాధించగా పుష్ప యాదవ్, ప్రియా మాలిక్ పసిడి పతకాలు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్లోఏడుగురు రజతాలు గెలుచుకున్నారు.