Team India | ‘నాకు నలుగురు స్పిన్నర్లు కావాలి. మేము అక్కడ (వెస్టిండీస్) చాలా క్రికెట్ ఆడాం. నలుగురు స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేశారన్నదానికి కారణాలను నేనిప్పుడు వెల్లడించను. అమెరికాకు వెళ్లాక చెబుతా..’ టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా విమానమెక్కబోయే ముందు చీఫ్ సెలక్టర్ అగార్కర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ అన్న మాటలవి. ఆ తర్వాత దీని గురించి ఎవరూ రోహిత్ను ఈ ప్రశ్న అడగకపోయినా ఫలితాలు మాత్రం కండ్ల ముందే కనిపిస్తున్నాయి.
ఈ టోర్నీలో ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్తో జరిగిన కీలక సెమీస్ మ్యాచే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గయానా పిచ్పై అక్షర్, కుల్దీప్ చేసిన స్పిన్ మాయకు బట్లర్ సేనకు కండ్లు బైర్లు కమ్మాయి. సూపర్8 దశ నుంచి ‘స్పిన్నర్లు భారత్కు మ్యాచ్ విన్నర్లు’గా మారారు. పేస్కు అనుకూలించిన అమెరికా పిచ్లపై కుల్దీప్ను పక్కనబెట్టిన భారత్.. తదుపరి దశలో మాత్రం అతడిని తుదిజట్టులోకి రప్పించి అనూహ్య ఫలితాలు రాబట్టింది.
ఫైనల్ మ్యాచ్లో మినహాయిస్తే అంతకుమునుపు 4 మ్యాచ్లలో అతడు 10 వికెట్లు పడగొట్టాడు. తుది పోరులో అంతగా ఆకట్టుకోకపోయినా ఈ టోర్నీలో అతడు 9 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్తోనూ రాణించగా సౌతాఫ్రికాతో ఫైనల్లోనూ జట్టును ఆదుకున్నాడు. భారత విజయాల్లో పేసర్లదీ కీలకపాత్రే. ఈ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరులలో అర్ష్దీప్ (17)దే అగ్రస్థానం. ఇక ‘మోస్ట్ ట్రస్టెడ్ బౌలర్’ జస్ప్రిత్ బుమ్రా 15 వికెట్లు తీసి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం భారత్కు వికెట్ కావాలనుకున్న ప్రతీసారి రోహిత్.. బుమ్రా వైపునకే చూశాడు. ఫైనల్లో భారత్ హీరో హార్దిక్ (11) సైతం అటు బ్యాట్తో ఇటు బంతితోనూ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం