Team India | ఢిల్లీ: క్రికెట్ను మతంగా భావించే భారత్లో అభిమానుల దశాబ్ది కలను నెరవేర్చిన భారత క్రికెట్ జట్టు వీరులు గురువారం ఉదయం స్వదేశానికి రానున్నారు. ఇటీవలే వెస్టిండీస్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన ఫైనల్ పోరులో సఫారీలను ఓడించి 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీని స్వదేశానికి తీసుకొస్తున్న రోహిత్సేన ఉదయం 6.20 గంటలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగిడనుంది.
ప్రపంచకప్ ముగిసి ఐదు రోజులు గడిచినా భారీ తుఫాను కారణంగా బార్బడోస్లోనే ఆగిన టీమ్ఇండియా ఎట్టకేలకు బుధవారం సాయంత్రం స్థానిక గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఎయిరిండియా చాంపియన్స్ 24 వరల్డ్ కప్’ అనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరింది. స్వదేశానికి రాగానే భారత జట్టు ప్రధాని నరేంద్రమోదీతో ఆయన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు.
విజయోత్సవ ర్యాలీ
మోదీతో బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్న భారత జట్టు.. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
రోజంతా బిజీ షెడ్యూల్