Team India : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో కాలుమోపిన భారత జట్టు (Team India) యావత్ భారతావనిని మరోసారి సంబురాల్లో ముంచేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో వాటర్ ట్యాంకర్ల సెల్యూట్తో మొదలు.. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో బ్రేక్ఫాస్ట్.. ఆపై ముంబైలో జన సంద్రం నడుమ వేడుకలా సాగిన ‘విక్టరీ పరేడ్’.. ఇలా ఆద్యంతం అభిమానులు రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు వరల్డ్ కస్ సంతోషాన్ని ఫ్యాన్స్తో పంచుకున్నారు.
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రాలు ట్రోఫీ విజయంలో కీలకమైన హార్దిక్ పాండ్యాను అభినందించారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు రూ.125 కోట్ల ప్రైజ్మనీ చెక్ను టీమిండియా క్రికెటర్లకు అందించారు. అటు పిమ్మట రోహిత్ సేన స్టేడియమంతా కలియదిరుగుతూ.. మార్కర్ పెన్నుతో సంతకాలు చేసిన బంతుల్ని స్టాండ్స్లోకి పంపించారు. ఆ దృశ్యాన్ని స్టేడియంలోని ఫ్యాన్స్ కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోయారు.
Rohit Sharma said – “Hats off to Hardik Pandya bowled final over and he bowled brilliantly”.
– Then Wankhade crowds chanting “Hardik Hardik”.#IndianCricketTeam #RohitSharma𓃵 #hardikpandya #Mumbai #wankhede pic.twitter.com/Rg1croF0Wj
— Sanjeev Dherdu (@sanjeevdherdu) July 4, 2024
బార్బడోస్లో జూన్ 29న పొట్టి ప్రపంచకప్ను ముద్దాడిన భారత జట్టు.. బెరిల్ తుఫాన్ కారణంగా ఆలస్యంగా స్వదేశంలో అడుగుపెట్టింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జూలై 4 ఉదయం టీమిండియా ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే దేశమంతా మరొకసారి సంబురాల్లో మునిగిపోయింది. వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత జట్టు సభ్యులు.. అశేష అభిమానుల సమక్షంలో వికర్టీ పరేడ్లో పాల్గొన్నారు. మెరైన్ డ్రైవ్ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేసింది.
No True Rohit Sharma Fan and Virat Kohli Fan will pass without liking this post 🔥
Goosebumps 🤯🔥
INDIAS PRIDE ROHIT SHARMA
INDIA THANKS KING KOHLI#VictoryParade #IndianCricketTeam #Mumbai #Wankhede pic.twitter.com/C2COB2gOgN— WORLD CUP FOLLOWER (@BiggBosstwts) July 4, 2024