IND vs SA : టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్లో అజేయంగా ఫైనల్ చేరిన భారత జట్టు (India) టైటిల్పై కన్నేసింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా.. రోహిత్ శర్మ బృంద దక్షిణాఫ్రికా (South Africa) సవాల్ను కాచుకోనుంది. సెమీ ఫైనల్లో బలమైన ఇంగ్లండ్ను ఆల్రౌండ్ షోతో మట్టికరిపించిన భారత్ సఫారీలను సఫా చేస్తే 11 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ కల నెరవేరినట్టే. అయితే.. కీలకమైన టైటిల్ ఫైట్కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుంది.
కారణమేంటంటే.. గయానాలో వరుణుడి అంతరాయాల నడుమ ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన అనంతరం బార్బడోస్కు వెళ్లింది. మ్యాచ్ ఎక్కువ సమయం సాగడంతో పాటు ప్రయాణ బడలిక కారణంగా ప్రాక్టీస్ సెషన్ను మేనేజ్మెంట్ రద్దు చేసింది. దాంతో, భారత క్రికెటర్లు శుక్రవారం విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అయ్యారు.
2️⃣ Unbeaten teams 1️⃣ Trophy at stake
South Africa and India will face off in Barbados for the ultimate prize 🏆#T20WorldCup #SAvIND pic.twitter.com/j8DC9YFIbM
— ICC (@ICC) June 27, 2024
భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 27 ఉదయం 10:30 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలు)కు షురూ కావాల్సింది. కానీ, వాన కారణంగా 75 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. భారత ఇన్నింగ్స్కు రెండుసార్లు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో, చివరకు సాయంత్రం నాలుగ్గంటల(భారత కాలమానం ప్రకారం జూన్ 28 ఉదయం 1:30 గంటలు)కు మ్యాచ్ ముగిసింది.
India remain unbeaten 😤
They face South Africa in the #T20WorldCup 2024 Final in Barbados. pic.twitter.com/HB2ZIG8yT7
— ICC (@ICC) June 27, 2024
తొలుత రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47)ల మెరుపులకు భారత్ 171 రన్స్ కొట్టింది. అనంతరం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ల మూడు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను కూల్చారు. దాంతో, భారత్ 68 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకెళ్లింది.