ట్రినిడాడ్: టీ20 వరల్డ్కప్(T20 Worldcup) సెమీస్లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. అయితే ఆ ఓటమికి ఇండియానే కారణమంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆరోపించారు. ఇండియాకు ప్రియార్టీ ఇవ్వడం వల్లే ఆఫ్ఘన్ వత్తిడికి గురి కావాల్సి వచ్చిందన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 56 రన్స్కే ఆలౌటైంది. అయితే వరల్డ్కప్ షెడ్యూల్ ఇండియాకు ఫేవర్గా రూపొందించారని, దాని వల్లే ఆఫ్ఘన్ జట్టుపై వత్తిడి పడినట్లు మైఖేల్ వాన్ ఆరోపించారు.
సూపర్-8 స్టేజ్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు సెమీస్ కోసం ప్రిపేరయ్యేందుకు ఎక్కువ సమయం లేకుండాపోయిందన్నారు. సోమవారం సెయింట్ విన్సెంట్లో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు అర్హత సాధించిందని, ఆ తర్వాత మంగళవారం ట్రినిడాడ్ వెళ్లేందుకు 4 గంటల పాటు ఫ్లయిట్ ఆలస్యం అయ్యిందని, కొత్త వేదికపై ప్రాక్టీస్ చేసే టైం లేకుండాపోయిందని, ఇది ఆటగాళ్లకు గౌరవం ఇవ్వలేకపోవడమే అని వాన్ పేర్కొన్నాడు.
గతంలో ఆ వేదికపై ఆడిన అనుభవం ఉన్నా.. సెమీ ఫైనల్కు ముందు ఒకరోజు ప్రిపరేషన్ ఉండాల్సిదే అని వాన్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ తన సెమీస్ మ్యాచ్ను గయానాలో ఆడాల్సి ఉందని, కానీ షెడ్యూల్ను ఇండియాకు ఫేవర్గా చేయడం వల్ల అన్నీ మారినట్లు చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్పై సెమీస్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో నెగ్గింది.
Surely this Semi should have been the Guyana one .. but because the whole event is geared towards India it’s so unfair on others .. #T20IWorldCup
— Michael Vaughan (@MichaelVaughan) June 27, 2024