Team India | టీమ్ ఇండియా (Team India) జట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి ( PM Modis residence) చేరుకుంది. ఉదయం ఐటీసీ మయూర నుంచి బస్సులో బయల్దేరిన రోహిత్ సేన.. లోక్ కల్యాణ్ మార్గ్ (Lok Kalyan Marg)లోని మోదీ ఇంటికి వెళ్లింది. బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమ్ ఇండియా జట్టు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఐటీసీ మయూర హోటల్కు వెళ్లిన టీమ్.. అక్కడి నుంచి నేరుగా ప్రధానిని కలిసేందుకు వెళ్లింది.
ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో టీమ్ ఇండియా ముంబైకి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
#WATCH | Delhi: Indian Cricket Team reaches 7, Lok Kalyan Marg, to meet Prime Minister Narendra Modi.
Team India with the T20 World Cup trophy arrived at Delhi airport today morning after winning the second T20I title. pic.twitter.com/fbmVpL2eWs
— ANI (@ANI) July 4, 2024
Also Read..
Team India | విమానంలో టీమ్ఇండియా సెలబ్రేషన్స్.. రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూశారా.. VIDEO
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు