Surya Kumar | దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ అనంతరం భారత జట్టు మరోసారి టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. 20వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. సూర్య 20వ ఓవర్ తొలి బంతికి లాంగ్ ఆఫ్ వద్ద బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టి మిల్లర్ను పెవిలియన్కు పంపాడు. ఈ క్యాచ్పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అది క్యాచ్ కాదని.. సిక్సర్ అంటూ పలువురు పేర్కొనగా.. వివాదం నెలకొన్నది. ఈ క్రమంలో తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిల్డింగ్ కోచ్ దిలీప్ తనతో పాటు విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఎప్పుడూ హాట్స్పాట్ ప్రాంతాల్లో ఫీల్డింగ్ చేయాలని చెప్పారని.. బంతి ఎక్కువగా అక్కడికే వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పాడన్నారు. తాను పట్టిన క్యాచ్ను అనేక మైదానాల్లో ప్రాక్టీస్ చేశానన్నాడు. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను ఎలాగైనా పట్టుకోవాలని తన మనసు చెప్పిందన్నాడు. రోహిత్ సాధారణంగా ఎక్కువసేపు నిలబడడని, కానీ ఆ సమయంలో అతను అక్కడే ఉన్నాడన్నాడు. బంతి తనవైపు వస్తున్న సమయంలో రోహిత్ వైపు చూశాడని.. బంతి వస్తున్నప్పుడు తాను అతన్ని చూశానని చెప్పాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి బంతిని పట్టుకోవడమే నా లక్ష్యమని.. రోహిత్ దగ్గరగా ఉంటే.. అతని వైపు విసిరేవాడనని.. కానీ దగ్గరగా లేకపోవడంతో రెండో ప్రయత్నంలో క్యాచ్ పట్టానని తెలిపాడు.
ఆ నాలుగైదు సెకన్లలో ఏం జరిగిందనే దానిపై తాను వర్ణించలేనన్నాడు. ఈ క్యాచ్పై భారీ స్పందన వస్తుందని.. మొబైల్కు భారీగా సందేశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు. తాను బంతిని క్యాచ్ను పట్టి బయటకు విసిరిన సమయంలో రోప్ని తాకలేదని తనకు తెలుసని.. మళ్లీ క్యాచ్ పట్టిన సందర్భంలోనూ రోప్ను తాకలేదన్నాడు. అది ఫర్ఫెక్ట్ క్యాచ్ అని తనకు తెలుసునని.. చివరకు ఏమైనా జరిగి ఉండవచ్చని చెప్పాడు. మ్యాచ్కు ముందు మంచి శిక్షణ తీసుకున్నామని.. ఇందులో 10-12 నిమిషాల పాటు పదికిపైగా హైక్యాచ్లు, ఫ్లాట్ క్యాచ్లు, డైరెక్ట్ హిట్, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. బెస్ట్ఫీల్డర్ పతకం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఏదైనా చేసేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నాడు.