లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత యువ సంచలనం సుమిత్ నాగల్ తొలి రౌండ్లో సెర్బియా టెన్నిస్ ప్లేయర్ మియోమిర్ కెస్మానోవిచ్తో తలపడనున్నాడు. సోమవారం(జూలై 1) నుంచి లండన్ వేదికగా ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.
తొలి రౌండ్ విఘ్నాన్ని దాటితే మూడో రౌండ్లో అతడు వరల్డ్ నంబర్వన్ జన్నిక్ సిన్నర్(ఇటలీ)తో తలపడే అవకాశాలున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ అల్కారజ్, సిన్నర్, జొకోవిచ్కు సులువైన డ్రా దక్కగా ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్ మొదటి రౌండ్లోనే బలమైన ప్రత్యర్థి సోఫియా కెనిన్ (అమెరికా)తో ఆడనుంది.