Wimbledon : భారత స్థార్ సుమిత్ నగాల్కు వింబుల్డన్(Wimbledon)టోర్నీలో షాక్ తగిలింది. తొలిసారి ఈ మెగాటోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన భారత కెరటం అనూహ్యంగా రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. సెర్బియాకు చెందిన మియోమిర్ కెక్మనోవిక్ (Miomir Kecmanovic) ధాటికి నగాల్ చేతులెత్తేశాడు. హోరీహోరీగా జరిగిన మ్యాచ్లో 2-6, 6-3, 3-6, 4-6తో పరాజయం చెందాడు.
ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించిన నగాల్ వింబుల్డన్లో బోణీ కొట్టలేకపోయాడు. తొలి సెట్ కోల్పోయినా పట్టుదలగా ఆడిన భారత ఆటగాడు రెండో సెట్ గెలిచాడు. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో గట్టిగానే ప్రయత్నించాడు. కానీ, మియోమిర్ ఏ మాత్రం చాన్స్ ఇవ్వలేదు. ఆఖరి రెండు సెట్లను గెలుపొంది రెండో రౌండ్కు దూసుకెళ్లాడు.
పురుషుల సింగిల్స్లో ఈమధ్యే అత్యుత్తమ ర్యాంక్(71) సాధించిన నగాల్ తన ఫేవరెట్ కాని గ్రాస్ కోర్టులో ప్రభావం చూపలేక మ్యాచ్ చేజార్చుకున్నాడు. సింగిల్స్లో ఓడిన అతడు డబుల్స్లో పతకంపై ఆశలు రేపుతున్నాడు. సెర్బియాకు చెందిన దసున్ లజోవిక్ – నగాల్ జోడీ తొలి పోరులో పెడ్రో మార్టినెజ్, జౌమె మునార్ జంటతో తలపడనుంది.