Akula Sreeja | న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024 ప్లేయర్ల వేలంలో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది.
ముంబైలో ఈ నెల10న జరిగే ప్లేయర్ల డ్రాఫ్ట్లో శ్రీజతో పాటు బెర్నాడెట్ స్టోక్స్ (రొమేనియా), ఖాద్రీ (నైజీరియా), నినా మితెల్హం (జర్మనీ) అత్యధిక మొత్తాన్ని సొంతం చేసుకునే చాన్స్ కనిపిస్తున్నది. ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీజ భారత ప్లేయర్లలో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.