ICC T20 Team | దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో చాంపియన్ టీమ్ భారత్ అగ్రభాగం దక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సుదీర్ఘ కలను సాకారం చేసుకున్న భారత్ జట్టు నుంచి ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఐసీసీ సోమవారం ప్రకటించిన వరల్డ్ లెవన్ టీమ్లో చోటు దక్కించుకున్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్శర్మతో పాటు సూర్యకుమార్యాదవ్, హార్దిక్పాండ్యా అక్షర్పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్సింగ్ ఉన్నారు.
తన దూకుడైన బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలకమైన రోహిత్కు చోటు దక్కగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు. మరోవైపు 4.17ఎకానమీ రేట్తో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన బుమ్రాతో పాటు అర్ష్దీప్సింగ్(17) చోటు దక్కించుకున్నారు. సెమీస్ చేరి సంచలనం సృష్టించిన అఫ్గన్ క్రికెటర్లు గుర్బాజ్, రషీద్ఖాన్, ఫారుఖితో పాటు ఆసీస్ నుంచి స్టొయినిస్, పూరన్(వెస్టిండీస్), నోకియా(12వ క్రికెటర్) టీమ్కు ఎంపికయ్యారు.
ఐసీసీ టీ20 టీమ్: రోహిత్, సూర్యకుమార్, హార్దిక్, అక్షర్, బుమ్రా, అర్ష్దీప్, గుర్బాజ్, రషీద్ఖాన్, ఫారుఖి, స్టొయినిస్, పూరన్, నోకియా(12వ క్రికెటర్)