Zimbabwe : భారత జట్టుతో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే (Zimbabwe) క్రికెట్ బోర్డు స్క్వాడ్ను ప్రకటించింది. ఆల్రౌండర్ సికిందర్ రజా (Sikinder Raza) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్ను సవాల్గా తీసుకున్న సెలెక్టర్లు అనుభవజ్ఞలతో పాటు కుర్రాళ్లకు చాన్స్ ఇచ్చారు. ఈమధ్యే ఆ దేశ పౌరసత్వం పొందిన చిచ్చరపిడుగు అతుల్ నఖ్వీ తుది బృందంలో చోటు దక్కించుకున్నాడు. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టిన జస్టిన్ సమ్మన్స్కు ఈ సిరీస్ పెద్ద పరీక్ష కానుంది.
పొట్టి వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించని జింబాబ్వే భారత్కు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. టీ20ల్లో రికార్డు బ్రేకర్ అయిన రజాతో పాటు తెండాయ్ చతర, వెస్లీ మధెవెరె, బ్రాండన్ మవుతా, వెల్లింగ్టన్ మసకజ్దలు ఆతిథ్య జట్టుకు కీలకం కానున్నారు.
Zimbabwe include Naqvi in squad for T20I series against India
Details 🔽https://t.co/MYR4waitsL pic.twitter.com/6pIg6AYy12
— Zimbabwe Cricket (@ZimCricketv) July 1, 2024
జింబాబ్వే స్క్వాడ్ : సికిందర్ రజా(కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, కాంప్బెల్ జొనాథన్, చతర టెండాయ్, జాంగ్వే లుకె, కైయ ఇన్నోసెంట్, మడన్డే క్లైవ్, మధెవెరె వెస్లీ, మరుమని తడివనషే, మసకజ్ద వెల్లింగ్టన్, మవుతా బ్రాండన్, ముజరబని బ్లెస్సింగ్, మయెర్స్ డియాన్, అతుమ్ నఖ్వీ, గరవ రిచర్డ్, శుంభా మిల్టన్.
భారత స్క్వాడ్ : శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.
భారత్, జింబాబ్వే జట్లు జూలై 6వ తేదిన తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. జూలై 7 వ తేదీన రెండో టీ20, జూలై 10న మూడో టీ20, జూలై 13న నాలుగో టీ20, జూలై 14న ఐదో టీ20 జరుగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్లు షురూ అవుతాయి.