Sikandar Raza | హరారే: భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు జింబాబ్వే జట్టును సోమవారం ఎంపిక చేశారు. 17 మందితో కూడిన జట్టుకు సీనియర్ క్రికెటర్ సికిందర్ రజా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 6 నుంచి భారత్, జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.
పొట్టి ఫార్మాట్కు క్రెగ్ ఇర్విన్, సీన్ విలియమ్స్ లాంటి సీనియర్లను పక్కకు పెట్టిన జింబాబ్వే సెలెక్షన్ కమిటీ..జూనియర్లను జట్టులోకి తీసుకుంది. బెల్జియంకు చెందిన అంతమ్ నక్విని ఎంపిక చేసినా అతని పౌరసత్వంపై స్పష్టత రావాల్సి ఉంది.