BCCI : భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలుకన్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumr Reddy) అరంగేట్రం ఆలస్యం కానుంది. జింబాబ్వే పర్యటన (Zimbabwe Tour)కు ఎంపికైన నితీశ్ గాయం కారణంగా టీ20 సిరీస్కు దూరం కానున్నాడు. ఈ యువ ఆల్రౌండర్ ప్రస్తుతం బీసీసీఐ(BCCI)కి చెందిన వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
దాంతో, నితీశ్ స్థానంలో శివం దూబే (Shivam Dube)ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్కు శుభ్మన్ సారథ్యం వహిస్తున్నాడు. జూన్ 23 సోమవారంన బీసీసీఐ జింబాబ్వే టూర్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
భారత స్క్వాడ్ : శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), శివం దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే.
భారత్, జింబాబ్వే జట్లు జూలై 6వ తేదిన తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. జూలై 7 వ తేదీన రెండో టీ20, జూలై 10న మూడో టీ20, జూలై 13న నాలుగో టీ20, జూలై 14న ఐదో టీ20 జరుగనుంది. మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్లు షురూ అవుతాయి.
దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా తరఫున మెరిసిన నితీశ్.. ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు ఆడిన అతడు ఆల్రౌండర్గా ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో చితక్కొట్టిన నితీశ్ 142.92 స్ట్రయిక్ రేటుతో 303 రన్స్ సాధించాడు. పలు మ్యాచుల్లో ఒత్తిడిలోనూ సమయోచిత బ్యాటింగ్తో టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దాంతో, అజత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టన్ బృందం జింబాబ్వే టూర్కు అతడిని ఎంపిక చేసింది.