INDW vs SAw : భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో అత్యధిక స్కోర్తో రికార్డులు బద్ధలు కొట్టేసింది. దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ఐకైక టెస్టులో తొలి రోజే ఐదొందలు బాదేసింది. చెపాక్ స్టేడియంలోడాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. వన్డే సిరీస్లో రెండు సెంచరీలతో మెరిసిన స్మృతి మంధనా(149) శతక గర్జన చేసింది. జెమీమా రోడ్రిగ్స్(55) సైతం అర్ధ సెంచరీతో కదం తొక్కగా ఆటముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 రన్స్ కొట్టింది.
వన్డే సిరీస్లో సఫారలను వైట్ వాష్ చేసిన టీమిండియా చెపాక్లో టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ తీసుకోవడంతో ఓపెనర్లు దక్షిణాఫ్రికా బౌలర్లను చితక్కొట్టారు. స్మృతి మంధనా(149) సెంచరీతో మెరవగా.. షఫాలీ డబుల్ సెంచరీతో అదరగొట్టింది. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 292 రన్స్ జోడించి ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తూ లేడీ సెహ్వాగ్ షఫాలీ అంతర్జాతీయ క్రికెట్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసింది. చివరకు 205 పరుగుల వద్ద రనౌట్ అయింది. అప్పటికీ టీమిండియా స్కోర్.. 411/3.
🤯 Fastest double-hundred in women’s Tests by Shafali Verma!
🔥 Third 💯 in four matches for Smriti Mandhana.
💥 292 – Record-highest opening stand in women’s Tests.India openers gave an incredible start in Chennai against South Africa!#INDvSA | 🔗: https://t.co/WGsjkNw98R pic.twitter.com/814ZYKAOGp
— ICC (@ICC) June 28, 2024
షాఫాలీ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(42 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(55)తో కలిసి వేగంగా ఆడింది. హాఫ్ సెంచరీ తర్వాత రోడ్రిగ్స్ వెనుదిరిగినా.. రీచా ఘోష్(43 నాటౌట్) జతగా హర్మన్ప్రీత్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడి జట్టు స్కోర్ 500 దాటించింది. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు 75 రన్స్ జోడించడంతో తొలి రోజు ఆటముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేయగలిగింది.