చెన్నై: మహిళల టెస్టు క్రికెట్(Womens Test cricket)లో స్మృతీ మందాన, షఫాలీ వర్మ కొత్త చరిత్ర లిఖించారు. ఓపెనింగ్ భాగస్వామ్యానికి ఆ జోడి అత్యధిక స్కోరును చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆ ఇద్దరూ తొలి వికెట్కు 292 రన్స్ జోడించారు. గతంలో పాకిస్థాన్ ఓపెనర్లు సాజిదా షా, కిరణ్ బాలూచ్లు తొలి వికెట్కు 241 రన్స్ జోడించారు. ఆ రికార్డును ఇవాళ స్మృతి, షఫాలీ జోడి బ్రేక్ చేసింది. మహిళల టెస్టు క్రికెట్లో ఏ వికెట్కైనా ఇది రెండవ అతిపెద్ద భాగస్వామ్యం. గతంలో ఆస్ట్రేలియా జోడి రీలర్, అన్నెట్ మూడవ వికెట్కు 309 రన్స్ జోడించారు.
స్మృతీ మందాన 149 రన్స్ చేసి ఔటైంది. గతంలో షఫాలీ, స్మృతి జోడి తొలి వికెట్కు అత్యధికంగా 167 రన్స్ చేశారు. 2021లో బ్రిస్టల్లో జరిగిన మ్యాచ్లో ఆ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 150 రన్స్ కన్నా ఎక్కువ పరుగులు చేసిన భారతీయ మహిళా క్రికెటర్లలో షఫాలీ నాలుగవ ప్లేయర్గా నిలిచారు. గతంలో మిథాలీ రాజ్, కామిని, సంధ్యా అగర్వాల్ 150 ప్లస్ రన్స్ స్కోర్ చేశారు.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు షఫాలీ, స్మృతీ మంచి స్టార్ట్ ఇచ్చారు. భోజన విరామ సమయానికి ఆ ఇద్దరూ 28 ఓవర్లలో 130 రన్స్ జోడించారు. శరవేగంగా ఇద్దరూ పరుగులు తీశారు. టీ టైంకు ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 334 రన్స్ చేసింది. స్మృతీ మందాన(149) ఇన్నింగ్స్లో 27 బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం భారత జట్టు.. 68 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 371 రన్స్ చేసింది. షఫాలీ 177 రన్స్తో క్రీజ్లో ఉన్నది.
🚨 Milestone Alert 🚨
2⃣9⃣2⃣
This is now the highest opening partnership ever in women’s Tests 🙌
Smriti Mandhana & Shafali Verma 🫡🫡
Follow the match ▶️ https://t.co/4EU1Kp7wJe#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @mandhana_smriti | @TheShafaliVerma pic.twitter.com/XmXbU9V3M6
— BCCI Women (@BCCIWomen) June 28, 2024