INDW vs SAW : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐకైక టెస్టులో భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వీరవిహారం చేసిన షఫాలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వన్డే సిరీస్లో చావు దెబ్బతిన్న దక్షిణాఫ్రికా బౌలర్లను ఈ లేడీ సెహ్వాగ్ ఉతికారేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసింది. తద్వారా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదేసిన రెండో భారత క్రికెటర్గా షఫాలీ చరిత్ర సృష్టించింది.
197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడ్డ షఫాలీ వరకు 205 పరుగుల వద్ద రనౌట్ అయింది. దాంతో, సఫారీలు ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. 411/3. షాఫాలీ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(4) ఆచితూడి ఆడుతోంది. మరో ఎండ్లో జెమీమా రోడ్రిగ్స్(41) దూకుడు కనబరుస్తోంది. వీరిద్దరూ ఈరోజంతా నిలబడితే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం.
Shafali Verma makes her maiden Test ton a double 💯 💯 🙌 https://t.co/07jDs5V6cu #INDvSA pic.twitter.com/p3GOTUSATn
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2024
టాస్ గెలిచిన హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ తీసుకోవడమే ఆలస్యం ఓపెనర్లు దక్షిణాఫ్రికా బౌలర్లనుచితక్కొట్టారు. స్మృతి మంధనా(149) సెంచరీతో మెరవగా షఫాలీ డబుల్ సెంచరీతో అదరగొట్టింది. వీళ్లిద్దరూ తొలి వికెట్కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఏకంగా 292 రన్స్ జోడించి ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టేశారు.