హరారే: జింబాబ్వే(Zimbabwe Tour)తో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. పురుషుల సెలక్షన్ కమిటీ ఈ ముగ్గుర్ని తొలి రెండు వన్డేలకు ఎంపిక చేశారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో ఆ ముగ్గురు ఆడనున్నారు. టీ20 వరల్డ్కప్ నుంచి తిరిగి వస్తున్న ఈ ముగ్గురూ ఇండియాకు వచ్చిన తర్వాత హరారే వెళ్తారు. జూలై ఆరో తేదీ నుంచి జింబాబ్వేతో అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.
తొలి రెండు టీ20లకు జట్టు : శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిశేక్ శర్మ, రింకూ సింగ్, ద్రువ్ జురల్(కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా ఉన్నారు.
🚨 NEWS 🚨
Sai Sudharsan, Jitesh Sharma and Harshit Rana added to India’s squad for first two T20Is against Zimbabwe.
Full Details 🔽 #TeamIndia | #ZIMvINDhttps://t.co/ezEefD23D3
— BCCI (@BCCI) July 2, 2024