IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తున్నభారత జట్టు (India) టైటిల్కు రెండడగుల దూరంలో నిలిచింది. గురువారం ఇంగ్లండ్ (England)తో జరగనున్న సెమీ ఫైనల్లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుతుంది. డిఫెండింగ్ చాంపియన్తో బిగ్ ఫైట్ కోసం భారత క్రికెటర్లు గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఈ మ్యాచ్ సన్నద్ధత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. ‘ఇంగ్లండ్తో సెమీస్ మ్యాచ్లో మేము కొత్తగా ఏమీ చేయాలనుకోవడం’ లేదని చెప్పాడు.
‘ఇప్పటివరకూ ఎలా ఆడుతున్నామో అదే తరహాలో ఇంగ్లండ్పైనా ఆడుతాం. ఒత్తిడికి లోన్వవకుండా స్వేచ్చగా ఆడాలనుకుంటున్నా. ప్రత్యర్ధి ఎవరు? అనేదానితో సంబంధం లేకుండా టోర్నీ ఆరంభం నుంచి మేము అదే చేస్తున్నాం. మా జట్టులో ప్రతి ఒక్కరికి తమ బాధ్యతలు తెలుసు. సెమీస్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాం’ అని హిట్మ్యాన్ తెలిపాడు.
Defending champions England square off against impressive India in the second semi-final in Guyana 👊#T20WorldCup | #INDvENGhttps://t.co/3m5Pvz91vJ
— ICC (@ICC) June 26, 2024
తొమ్మిదో సీజన్లో రోహిత్ సేన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. సమిష్టి ప్రదర్శనతో లీగ్ దశనుంచి సూపర్ 8 వరకూ విజయాల బాటలో పయనించింది. దాంతో, నాకౌట్ మ్యాచ్ అయిన సెమీస్లోనూ ఇంగ్లండ్పై చెలరేగాలని భారత్ భావిస్తోంది. సూపర్ 8 ఆఖరి మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాకు చెక్ పెట్టిన టీమిండియా బట్లర్ సేనను ఇంటికి పంపేందుకు సిద్దమైంది.
కానీ, 2022 ఎడిషన్లో ఇంగ్లండ్ సెమీస్లో 10 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. దాంతో, ఆ ఓటమికి ఈసారి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేనకు అవకాశం దొరికింది. అయితే.. బట్లర్తో పాటు లోయర్ ఆర్డర్ వరకూ అందరూ హిట్టర్లే ఉన్న ఇంగ్లండ్తో గట్టి పోటీ తప్పకపోవచ్చు. కానీ, ఈ మ్యాచ్కు వాన ముప్పు ఉంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వ్ డే లేనందున గ్రూప్ లో టాప్గా ఉన్న టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లే చాన్స్ ఉంది.