IND vs ENG : గయానాలో వర్షం అడ్డుపడుతూ సాగుతున్న సెమీఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకం బాదాడు. సామ్ కరన్(Sam Curran) వేసిన 13వ ఓవర్లో సిక్సర్తో హిట్మ్యాన్ యాభైకి చేరువయ్యాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్(39) సైతం ధనాధన్ ఆడుతున్నాడు.
టాప్లే, సామ్ కరన్ విజృంభణతో 40 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో.. వీళ్లిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలింగ్ యూనిట్ను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇప్పటికే 73 రన్స్ జోడించారు. దాంతో, టీమిండియా 13 ఓవర్లకు 110 రన్స్ స్కోర్ చేసింది.
A captain’s knock 👏
Back-to-back @MyIndusIndBank Milestones for skipper Rohit Sharma at the #T20WorldCup 2024 5️⃣0️⃣#INDvENG pic.twitter.com/QSBGKBaqWI
— ICC (@ICC) June 27, 2024
టాస్ ఓడిన భారత్కు శుభారంభం లభించిందని మురిసే లోపు విరాట్ కోహ్లీ(9) ఔటయ్యాడు. టాప్లే వేసిన రెండో ఓవర్లో విఫలమయ్యాడు. సిక్సర్తో టచ్లోకి వచ్చిన్టటే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు. ఇక టోర్నీ ఆసాంతం దంచేసిన రిషభ్ పంత్(4) సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో సులువైన క్యాచ్ ఇచ్చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ అండగా రోహిత్ భాగస్వాయ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు.