Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్లో వీరబాదుడు బాదుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో రికార్డు నెలకొల్పాడు. టీమిండియా సారథిగా అన్ని ఫార్మట్లలో 5 వేల పరుగుల మైలురాయికి రోహిత్ చేరువయ్యాడు. ఇంగ్లండ్తో గయానాలో జరుగుతున్న సెమీ ఫైనల్లో హిట్మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు.
దాంతో, ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో భారత కెప్టెన్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. తద్వారా దిగ్గజాలు మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin), సౌరభ్ గంగూలీల సరసన రోహిత్ స్థానం సంపాదించాడు. ప్రస్తుతం ఈ విధ్వంసక ఓపెనర్ ఖాతాలో 5,013 పరుగులు ఉన్నాయి.
Talk about leading from the front 🫡
Captain Rohit Sharma put on a stunning show with the bat to set up #TeamIndia‘s win & bagged the Player of the Match award 👏 👏#T20WorldCup | #AUSvIND | @ImRo45 pic.twitter.com/gCo66HWeVa
— BCCI (@BCCI) June 24, 2024
రోహిత్ కంటే ముందు మహ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఈ మైలురాయిని అధిగమించారు. ఈ జాబితాలో కోహ్లీ 12,883 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు. ఇక ధోనీ 11,207 రన్స్తో రెండో స్థానంలో నిలిచాడు. అజారుద్దీన్ 8,095 పరుగులు సాధించగా.. దాదా 7,643 రన్స్ కొట్టాడు.