జార్జ్టౌన్: టీ20 వరల్డ్కప్లో ఇండియా ఫైనల్లోకి ప్రవేశించినా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు టోర్నీలో అతను ఏడు ఇన్నింగ్స్ల్లో కేవలం 75 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్పై విమర్శలు వస్తున్నాయి. ఈ యేటి ఐపీఎల్లో అత్యధికంగా 741 రన్స్ చేసిన కోహ్లీ.. టీ20 వరల్డ్కప్లో మాత్రం దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో అతను భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఫామ్లో లేని కోహ్లీకి కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ అండగా నిలిచారు. కొంత రిస్కీ క్రికెట్ ఆడినప్పుడు కొన్ని సందర్భాల్లో కలిసి రాదు అని ద్రావిడ్ అన్నారు. ఇంగ్లండ్తో ఆడిన మ్యాచ్లో ఆరంభంలో భారీ సిక్సర్ కొట్టాడని, కానీ దురదృష్టవశాత్తు మరో బంతికి ఔటయ్యాడని పేర్కొన్నారు. కానీ అతను ఏ ఆలోచనతో ఆడుతున్నాడో, దాన్ని ఇష్టపడుతున్నట్లు ద్రావిడ్ తెలిపాడు. ముందు మరో భారీ మ్యాచ్ ఆడాల్సి ఉందని, అతని ఆటిట్యూడ్ నచ్చినట్లు చెప్పాడు.
శనివారం జరిగే ఫైనల్లో కోహ్లీ రాణిస్తాడని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. అతనో నాణ్యమైన ప్లేయర్ ని, కొన్ని సందర్భాల్లో ఏ ఆటగాడైనా వడిదిడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పెద్ద పెద్ద మ్యాచుల్లో అతను ఉండడం కీలకమని రోహిత్ చెప్పాడు. ఫామ్ అనేది సమస్య కాదు అని, ఎందుకంటే 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారని, రన్స్ చేయాలన్న తపన అతనిలో ఉందని రోహిత్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్లో ఇప్పటి వరకు రోహిత్ 248 రన్స్ చేశాడు.