ICC : పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు విజయంలో భాగమైన సారథి రోహిత్ శర్మ(Rohit Sharma), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)లు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు’ రేసులో నిలిచారు. జూన్ నెలకు గానూ ఈ ఇద్దరూ ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక టీ20 ప్రపంచ కప్లో అత్యధిక (17) వికెట్లు తీసిన అఫ్గనిస్థాన్ పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ సైతం ఈ మెడల్కు పోటీ పడుతున్నాడు.
ఇక మహిళల విభాగంలో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధానా (Smriti Mandhana) బరిలో ఉంది. ఆమెతో పాటు ఇంగ్లండ్ అమ్మాయి మియా బౌచెర్, శ్రీలంక క్రికెటర్ విశ్మీ గుణరత్నేలు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో ఉన్నారు. దక్షిణాఫ్రికా సిరీస్లో మూడు సెంచరీలతో విరుచుకు పడిన మంధాన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినేషన్ దక్కించుకుంది. మరోవైపు గుణరత్నే వెస్టిండీస్ సిరీస్లో వీరకొట్టుడు కొట్టింది. 83.22 స్ట్రయిక్ రేటుతో 134 రన్స్ సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకుంది.
Three top-order batters are the nominees for the ICC Women’s Player of the Month for June 2024 👊
More ⬇https://t.co/N5r4rd1jkz
— ICC (@ICC) July 4, 2024
వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ముందుండి భారత జట్టును నడిపించాడు. ఓపెనర్గా శుభారంభాలు ఇస్తూ.. కెప్టెన్గా తెలివైన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియాపై 92.. ఆపై సెమీస్లో ఇంగ్లండ్పై 59 వీర బాదుడు బాదాడు. బౌలింగ్లో బుమ్రా సంచలన స్పెల్తో టీమిండియా విజయాల్లో భాగమయ్యాడు. ఫైనల్లోనూ 18 పరుగులకే రెండు కీలక వికెట్లు తీసి మొత్తంగా 15 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుపొందాడు.
Three #T20WorldCup stars in the run for ICC Men’s Player of the Month for June 👏
More ⬇https://t.co/HcJqtb3as2
— ICC (@ICC) July 4, 2024
అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్మమిచ్చిన వరల్డ్ కప్లో భారత జట్టు అజేయంగా ట్రోఫీని అందుకుంది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగులతో ఓడించి 13 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసింది. అంతేకాదు.. ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లు ఆ జట్టులో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్లు ఎంపికయ్యారు.