లండన్: ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాళ్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, మైఖెల్ వాన్ కుమారులు వాళ్ల తండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. శ్రీలంకతో స్వదేశంలో జరుగబోయే రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ తాజాగా ప్రకటించిన అండర్-19 జట్టులో ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్, వాన్ కుమారుడు ఆర్చీ వాన్ చోటు దక్కించుకున్నారు.
వీళ్లిద్దరితో పాటు సీనియర్ టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న రిహాన్ అహ్మద్ సోదరుడు ఫర్హాన్ అహ్మద్ సైతం ఎంపికయ్యాడు. జూలై 8 నుంచి 19 దాకా ఇంగ్లండ్.. లంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఈ టెస్టులలో రాణిస్తే వీళ్లు జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశముంది.