సెయింట్ లూసియా: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో 9 సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్న తొలి బౌలర్గా నిలచాడతను. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతను కీలకమైన నాలుగు వికెట్లు తీసి ఆ కొత్త మైలురాయిని అందుకున్నాడు. రషీద్ ఖాన్ తర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉన్నారు. షకీబ్ 8 సార్లు నాలుగేసి వికెట్లు తీసుకున్నాడు. ఇక ఉగాండా బౌలర్ హెన్రీ సెన్యోడా ఏడు సార్లు నాలుగేసి వికెట్లు తీసి మూడవ స్థానంలో ఉన్నారు.
ఇవాళ జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 రన్స్ తేడాతో బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. 25 ఏళ్ల రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. సరైన సమయంలో వికెట్లను తీసి మ్యాచ్లో ఉత్కంఠ రేపారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇవాళ నాలుగు ఓవర్లు వేసి 23 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేట్ 5.80గా ఉంది. బంగ్లా బ్యాటర్లు సౌమ్యా సర్కార్, తౌహిద్ హృదయ్, మహమ్మదుల్లా, రిషాద్ హుస్సేన్ వికెట్లను అతను తీశాడు. టీ20ల్లో శరవేగంగా 150 వికెట్లను తీసుకున్న బౌలర్గా కూడా రషీద్ మైలురాయి అందుకున్నాడు.