IND vs ENG : ప్రొవిడెన్స్ స్టేడియం (Providence Stadium)లో భారత ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించింది. 8 ఓవర్లు ముగిశాక చినుకులు షురూ అయ్యాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డగౌటకు పరుగెత్తారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. 65/2. కెప్టెన్ రోహిత్ శర్మ(37), సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో ఆడుతున్నారు. వీళ్లిద్దరూ మూడో వికెట్కు 25 రన్స్ జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
టాస్ ఓడిన భారత్కు శుభారంభం లభించిందని మురిసే లోపు విరాట్ కోహ్లీ(9) ఔటయ్యాడు. టాప్లే వేసిన రెండో ఓవర్లో సిక్సర్తో టచ్లోకి వచ్చిన్టటే కనిపించినా వికెట్ పారేసుకున్నాడు. ఇక టోర్నీ ఆసాంతం దంచేసిన రిషభ్ పంత్(4) సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో సులువైన క్యాచ్ ఇచ్చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ అండగా రోహిత్ భాగస్వాయ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు.