బార్బడోస్: టీమ్ఇండియాకు పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్.. హెడ్కోచ్గా తన ఆఖరి ప్రసంగంలో సారథి రోహిత్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత హెడ్కోచ్ బాధ్యతల నుంచి వైదొలుగుదామని అనుకున్నానని, కానీ రోహిత్ ఫోన్ చేసి తనను ఒప్పించాడని ద్రావిడ్ అన్నాడు.
‘రో.. గతేడాది నవంబర్లో నువ్వు నాకు ఫోన్ చేసి కోచ్గా కొనసాగాలని అడిగావు. అందుకు థ్యాంక్యూ వెరీ మచ్..’ అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడాడు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని, సమిష్టిగా ఆడటం వల్లే ఐసీసీ ట్రోఫీ కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు.
జట్టులో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ద్రావిడ్.. ఈ విజయాన్ని ఆస్వాదించాలని, ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన పరుగులు, తీసిన వికెట్ల కంటే ఇలాంటి మధుర క్షణాలే కలకాలం గుర్తుంటాయంటూ ద్రావిడ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది.