టెక్సాస్: యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఎనిమిదో సీడ్ ప్రియాన్షు రజావత్ 21-18, 21-16తో హువాంగ్ యు కి (చైనీస్ తైఫీ) పై నెగ్గాడు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్ 15-21, 21-19, 21-14తో తెరెజా స్వాబికోవా(చెక్ రిపబ్లిక్)పై పోరాడి గెలిచింది. మహిళల డబుల్స్లో భారత ద్వయం త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ 16-21, 21-11, 21-19తో సె పీ షాన్-హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ)ని ఓడించి క్వార్టర్స్కు అర్హత సాధించింది.