Team India | టీ20 ప్రపంకప్ను గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియా (Team India) జట్టు రేపు స్వదేశానికి చేరుకోనున్న విషయం తెలిసిందే. బెరిల్ హరికేన్ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా బార్బడోస్లోనే చిక్కుకుపోయిన రోహిత్ సేన.. ఎట్టకేలకు ఇవాళ బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత్కు బయల్దేరింది. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం టీమ్ఇండియా బిజీబిజీగా గడపనుంది.
ఢిల్లీలో ల్యాండ్ కాగానే.. వారంతా ఫ్రెష్ అయ్యి ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) కలవనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లనున్నారు. మోదీతో మీటింగ్ అనంతరం టీమ్ఇండియా జట్టు చార్టర్డ్ ఫ్లైట్లో ముంబైకి వెళ్లనుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో పరేడ్కు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియంకు చేరుకున్న రోహిత్ సేన.. అక్కడ ఒక కిలోమీటరు మేర ఓపెన్ టాప్ బస్సులో పరేడ్ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. అనంతరం అక్కడ బీసీసీఐ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read..
Team India | ఎట్టకేలకు బార్బడోస్ను వీడిన టీమ్ఇండియా.. ప్రత్యేక ఫ్లైట్లో భారత్కు పయనం
T20 World Cup | వరల్డ్ కప్ వస్తోంది.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ