PM Modi | ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్కోహ్లీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
చెన్నై: భారత్తో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫాలోఆన్ ఆడుతున్నది. ఒకే రోజు మిగిలున్న ఆటలో మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. సునె లుస్(109) సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ వోల్వార్డ్(93 నాటౌట్) అర్ధసెంచరీ చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 266కు ఆలౌటైంది.