PM Modi With Team India | టీ20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం జగజ్జేత టీమిండియా ఢిల్లీకి చేరింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. అనంతరం టీమిండియా బృందం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని టీమిండియా కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రావిడ్ సహా ఆటగాళ్లందరినీ ఆప్యాయంగా ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకున్నారంటూ క్రికెటర్లను అభినందించారు. ఈ సందర్భంగా పలువురి సరదా ప్రశ్నలు అడిగారు.
అవేంటో తెలుసుకుందాం. ఫైనల్లో విజయవంతం అనంతరం రోహిత్ శర్మ బార్బడోస్ స్టేడియంలో బోర్లాపడుకొని లేచి.. ఆ తర్వాత మట్టిని రెండుసార్లు నోటో వేసుకున్నాడు. దీన్ని చేసిన మోదీ.. ‘రోహిత్ పిచ్ రుచి ఎలా ఉంది’ అందరూ నవ్వించారు. ఇక క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చి మంచి స్కోర్ చేయడం ఎలా అనిపించింది? అని అక్షర్ పటేల్ను ప్రశ్నించారు. మ్యాచ్పై టీమిండియా ఆశలు వదులుకున్న సమయంలో అతితక్కువ పరుగులు ఇచ్చిన బుమ్రాను మోదీ ప్రశంసించారు. ఒత్తిడిలో ఓవర్ వేసే సమయంలో బూమ్రా మదిలో ఏం ప్రశ్నలు తలెత్తాయోనని అడిగి తెలుసుకున్నారు. బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ను పట్టి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సూర్యకుమార్ ప్రధాని అభినందించారు.