హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) టైటిల్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఓయూ 3-1తో ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీపై అద్భుత విజయం సాధించింది. దీని ద్వారా పంజాబ్లో ఈనెల 9 నుంచి 11 వరకు జరిగే ఆల్ఇండియా యూనివర్సిటీ టోర్నీకి ఓయూ అర్హత సాధించింది. ఫైనల్ విషయానికొస్తే సింగిల్స్ ఫైనల్లో మహమ్మద్ అలీ 11-6, 10-12, 11-8, 11-4తో శ్రీకృష్ణపై గెలువగా, కేశవన్ కన్నన్ 11-5, 11-7, 11-3తో అభినయ్పై, అలీ 11-8, 11-9, 8-11, 11-9తో అభినయ్పై గెలువగా, వరుణ్ శంకర్ 8-11, 8-11, 9-11తో లక్ష్మణ్ చేతిలో ఓడాడు.