Team India Victory Parade : ఐసీసీ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టు(Team India)కు దేశమంతా జేజేలు పలుకుతోంది. ఓపెన్ టాప్ బస్సులో జరుగబోయే ‘విక్టరీ పరేడ్’ కోసం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరల్డ్ కప్ వీరులకు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. ‘నారీమన్ పాయింట్’ (Naiman Point) నుంచి మొదలవ్వనున్న విజయోత్సవ యాత్రలో పాల్గొనేందుకు అరేబియన్ సముద్రపు ఒడ్డున లక్షల మంది చేరారు.
దాంతో, వాంఖడే స్టేడియం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు వాహనదారులను మరైన్ డ్రైవ్ వైపు రావొద్దంటూ హెచ్చరించారు. ‘మరైన్ డ్రైవ్ ప్రాంతం మొత్తం నిండిపోయింది. ఇటువైపు ఎవరూ రావొద్దు’ అంటూ జనసంద్రమైన ఫొటోను పోస్ట్ చేశారు.
బార్బడోస్లో పొట్టి ప్రపంచకప్ను ముద్దాడిన భారత జట్టు బెరిల్ తుఫాన్ (Beryl Hurricane) కారణంగా స్వదేశంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జూలై 4 ఉదయం టీమిండియా ఢిల్లీలో దిగగానే దేశమంతా మరొకసారి సంబురాల్లో మునిగిపోయింది.
𝙎𝙀𝘼 𝙊𝙁 𝘽𝙇𝙐𝙀! 💙
From #TeamIndia to the fans, thank you for your unwavering support 🤗#T20WorldCup | #Champions pic.twitter.com/GaV49Kmg8s
— BCCI (@BCCI) July 4, 2024
వరల్డ్ కప్ ట్రోఫీతో ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత జట్టు సభ్యులు.. అశేష అభిమానుల సమక్షంలో వికర్టీ పరేడ్కు రెడీ అయ్యారు. సాయంత్రం 4ః30 గంటలకు అనుకున్న మెరైన్ డ్రైవ్ పరేడ్ మరికాసేపట్లో షురూ కానుంది. అక్కడ ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. సందడిగా ముందుకు సాగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
A memorable occasion as #TeamIndia got the opportunity to meet the Honourable Prime Minister of India, Shri Narendra Modiji in Delhi 🙌@narendramodi | @JayShah pic.twitter.com/eqJ7iv9yVw
— BCCI (@BCCI) July 4, 2024