సుల్తాన్బజార్, ఆగస్టు 30: క్రీడాకారులకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రిగా.. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, కామన్వెల్త్ కాంస్య విజేత హుసాముద్దీన్, ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ ఈషా సింగ్లను మంత్రి ఘనంగా సన్మానించి.. నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క్రీడారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వ్యాపారులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్, ప్రతాప్, చంద్రశేఖర్, కొండల్ రెడ్డి, ఉమాదేవి, రవికుమార్,సునీల్ కుమార్ పాల్గొన్నారు.