స్టట్గార్ట్: గత రెండు వారాలుగా ఫుట్బాల్ అభిమానులను అలరిస్తున్న ప్రతిష్టాత్మక యూరో కప్ కీలక దశకు చేరుకుంది. 24 జట్లు 6 గ్రూపులుగా విడిపోయి తలపడ్డ ఈ టోర్నీ క్వార్టర్స్కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ గ్రూపు దశలోనే వెనుదిరగగా టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ఆతిథ్య జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లండ్ క్వార్టర్స్ చేరాయి.
మంగళవారం రాత్రి టర్కీ 2-1తో ఆస్ట్రియాను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖా యం చేసుకుంది. శుక్రవారం నుంచి మొదలుకాబోయే క్వార్టర్స్లో స్పెయిన్-జర్మనీ, పోర్చుగల్-ఫ్రాన్స్, ఇంగ్లండ్-స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్-టర్కీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.