INDW vs SAW : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు క్లీన్స్వీప్ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో ఓపెనర్ స్మృతి మంధాన(90) మెరుపులతో జయభేరి మోగించింది. 216 పరుగుల స్వల్ప ఛేదనలో దూకుడుగా ఆడిన మంధనా హ్యాట్రిక్ సెంచరీ చేజార్చుకున్నా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(42), జెమీమా రోడ్రిగ్స్(19) జట్టును విజయతీరాలకు చేర్చారు. దాంతో, మూడు వన్డేల సిరీస్లో సఫారీ జట్టు వైట్వాష్ తప్పలేదు. ఈ సిరీస్లో రెండు సెంచరీలు బాదిన మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
సొంతగడ్డపై అదరగొడుతున్న భారత మహిళల జట్టు మూడో వన్డేలోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన టీమిండియా నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో జోరు చూపించింది. సఫారీలు నిర్దేశించిన స్వల్ప ఛేదనలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ(25) మరోసారి నిరాశపరచగా.. ప్రియా పూనియా (28) ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్(42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. జెమీమీ రోడ్రిగ్స్(19 నాటౌట్)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆమె ఔటయ్యాక రీచా ఘోష్(6 నాటౌట్) జతగా జెమీమా లాంఛనాన్ని పూర్తి చేసింది.
A Smriti Mandhana masterclass helps India win the ODI series against South Africa 3-0 👏#INDvSA | 🔗: https://t.co/OQ4FxbDT0T pic.twitter.com/rNhYGsS2eD
— ICC (@ICC) June 23, 2024
టాస్ గెలిచిన సఫారీలకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు లారా వొల్వార్డ్త్(61), తజ్మిన్ బ్రిట్స్(38)లు మరోసారి ధనాధన్ ఆడారు. భారత కెప్టెన్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. అయితే.. 20వ ఓవర్ ఆఖరి బంతికి ఈ జంటను అరుంధతీ రెడ్డి విడదీసింది. ఆ కాసేపటికే మరిజానే కాప్(7)తో సమన్వయ లోపం కారణంగా తజ్మిన్ రనౌట్ కావడంతో సఫారీ జట్టు స్కోర్ నెమ్మదించింది. దీప్తి శర్మ, పూజా వస్త్రకర్లు వికెట్ల వేటతో ఒత్తిడి పెంచారు.
Captain Laura Wolvaardt top scores for South Africa, but they falter once she and Tazmin Brits are dismissed – India’s target to sweep the ODI series is 216 #INDvSA
👉 https://t.co/qlOetQyjcO pic.twitter.com/Xbp81FoiZ7
— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2024
ఒకదశలో 150లోపు పర్యాటక జట్టు ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ, డె క్లెర్క్(26), రిడ్డర్(26) క్రీజులో పాతుకుపోయి సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును కదిలించారు. వీరిద్దరి పోరాటంతో సఫారీ టీమ్ స్కోర్ 200 దాటింది. స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. దీప్తి శర్మ(227), అరుంధతి రెడ్డి(236)ల విజృంభణతో మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టెయిలెండర్లు నడినె డె క్లెర్క్(), మైకీ డి రిడ్డర్ ()లు నిలబడడంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 రన్స్ కొట్టింది.