Indian Cricketers : టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో దేశాన్ని సంబురాల్లో ముంచెత్తిన భారత ఆటగాళ్ల (Indian Cricketers )పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓపెన్ టాప్ బస్సులో ‘విక్టరీ పరేడ్’లో లక్షలాదిమంది నీరాజనాలు పలకగా.. బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్మనీతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ కప్ విజేతలను మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) సన్మానించారు. ప్రపంచ కప్ జట్టులోని ముంబై ఆటగాళ్లను ఆయన ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి మరీ అభినందించారు.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, యువకెరటం యశస్వీ జైస్వాల్ను శుక్రారం షిండే సత్కరించారు. ఈ నలుగురు క్రికెటర్లను ముంబైలోని తన నివాసానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి పొట్టి వరల్డ్ విజయం గురించి వాళ్లతో ముచ్చటించారు.
#LIVE | #वर्षा निवासस्थान | विश्वचषक विजेत्या खेळाडूंचा मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या हस्ते सत्कार https://t.co/BatV2w0raJ
— CMO Maharashtra (@CMOMaharashtra) July 5, 2024
జగజ్జేతలుగా స్వదేశంలో అడుగుపెట్టినందుకు అభినందనలు లిపిన షిండే.. హిట్మ్యాన్, సూర్య, దూబే, యశస్వీలకు శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి పంపించారు. భారత క్రికెటర్లను షిండే సన్మానించిన వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.