IND vs SA : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టుకు భారీ షాక్. పవర్ ప్లే ముగిసేలోపే టాప్ ఆటగాళ్లంతా డగౌట్కు వెళ్లారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఒకే ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ(9), రిషభ్ పంత్(0)లను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కగిసో రబడ డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(3)ను వెనక్కి పంపాడు.
లెగ్సైడ్ సూర్య కొట్టిన బంతిని బౌండరీ వద్ద క్లాసెన్ ఖతర్నాక్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 33 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో, ఇన్నింగ్స్ నిర్మించే భారమంతా విరాట్ కోహ్లీ(25)పై పడింది. ప్రస్తుతానికి అక్షర్ పటేల్(8)తో11 రన్స్ జోడించాడు. వీళ్లిద్దరూ 10 ఓవర్ల వరకూ ఆడితే భారత్ కోలుకున్నట్టే. పవర్ ప్లేలో భారత జట్టు స్కోర్.. 45/3.
MAHARAJ HAS TWO IN THREE BALLS! 🔥
Rishabh Pant is out for a duck! https://t.co/L6YamlfxUQ | #SAvIND | #T20WorldCup pic.twitter.com/UvcTY8hVPS
— ESPNcricinfo (@ESPNcricinfo) June 29, 2024