Virat Kohli : పొట్టి ప్రపంచ కప్ విజేతల సన్మాన సభలో విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. మెగా టోర్నీలో టీమిండియా అజేయ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఆకాశానికెత్తేశాడు. వాంఖడే స్టేడియంలో 36 వేల మంది అభిమానుల సమక్షంలో బుమ్రాను ఏకంగా ‘ఎనిమిదో వింత’గా విరాట్ అభివర్ణించాడు. అంతేకాదు బుమ్రాను ఎనిమిదో వండర్గా ప్రకటించడం కోసం తాను అఫిడవిట్లపై సంతకం పెడుతానని కోహ్లీ తెలిపాడు.
‘విక్టరీ పరేడ్’ అనంతరం వాంఖడే స్టేడియంలో జగజ్జేతలకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ప్రజెంటర్ గౌరవ్ కపూర్ వేదికమీదికి పిలవగానే .. బార్బడస్లోని కెన్సింగ్టన్ ఓవల్(Kensington Oval)లో ఆద్యంత ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడాడు. ‘ఒకానొక దశలో మ్యాచ్ మళ్లీ చేజారుతుంది అనిపించింది. ఆ దశలో ఆఖరి ఐదు ఓవర్లు నిజంగా అద్భుతం. వాటిలో బుమ్రా వేసిన రెండు ఓవర్లు అయితే చాలా స్పెషల్. వరల్డ్ కప్లో జట్టును ప్రతిసారి పోటీలోకి తెచ్చిన బుమ్రాను అందరూ అభినందించాల్సిందే.
అందుకని అతడు వీలైనన్ని రోజు భారత జట్టుకు ఆడాలని అందరం కోరుకుందాం. బుమ్రాను ప్రపంచంలోని ఎనిమిదో వండర్గా ప్రకటించేందుకు అవసరమైన కాగితాలపై నేను సంతకం చేస్తాను. అంతేకాదు ఒకతరంలో కనిపించే మేటి బౌలర్ అతడు. అతడు మనతో కలిసి ఆడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని కోహ్లీ వెల్లడించాడు.
This Day. This Celebration. This Reception 💙#TeamIndia | #T20WorldCup | #Champions pic.twitter.com/nhdoqqVUzU
— BCCI (@BCCI) July 4, 2024
వరల్డ్ కప్లో బుమ్రా తానొక చాంపియన్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి వికెట్ తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఈ యార్కర్ కింగ్ తన మార్క్ చూపించాడు. సఫారీల విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన వేళ బంతి అందుకున్న బుమ్రా.. మార్కో జాన్సెన్ వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
ఇక ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 8 పరుగులే ఇవ్వడంతో భారత జట్టు రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్గా అవతరించింది. మెగా టోర్నీలో 15 వికెట్లతో రాణించిన బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
वंदे मातरम 🇮🇳 pic.twitter.com/j5D4nMMdF9
— BCCI (@BCCI) July 4, 2024